వైష్ణోదేవి ఆలయ రహస్యం | Vaishno Devi Temple History in Telugu | bhakthi margam | భక్తి మార్గం


వైష్ణవ దేవి ఆలయం

వైష్ణవ దేవి ఆలయం, ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. 

జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైంది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూడ కొండ ఎక్కేవారు జై మాతాజూ అంటూ అరుస్తుంటారు.

ఆలయ చరిత్ర

వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుపాండవ సంగ్రామంనకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి, ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెపుతోంది. "జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" అనే శ్లోకం ఆధారంతో ఈ దేవస్థానంలోనే అర్జునుడు పూజలు చేసాడని తెలుస్తుంది. 

స్థలపురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మించారని తెలుస్తుంది. త్రికూటపర్వతానికి పక్కన ఐదు రాతి కట్టడాలున్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు.మధ్యకాలపు చరిత్ర ప్రకారం మొదటగా సిక్కుల గురువైన గురు గోబింద్ సింగ్, పుర్మండాల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించాడని తెలుస్తుంది. గుహలకు ఉన్న ఒక పాత కాలపు నడక బాట ఈ మార్గం గుండా ఉంది.

ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సంప్రదాయాల శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. కొన్ని సంప్రదాయంల వారు మాత్రం అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకాల మూలముగా తెలియవచ్చేది ఏమనగా, కశ్మీరంలో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పంను అమ్మవారి వరద హస్తంగా భక్తులు గౌరవిస్తారు.

కత్రా మాత వైష్ణో దేవి ఆలయం సాంప్రదాయ భారతీయ ఆలయ నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణ. ఈ ఆలయం ఒక గుహ ఆకారంలో నిర్మించబడింది మరియు సహజమైన రాతి నిర్మాణాలతో నిర్మించబడింది. ఆలయ ప్రవేశ ద్వారం హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణిస్తూ అందమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడింది.

ఆలయం లోపల, దేవత వైష్ణో దేవికి అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉంది. ఈ మందిరం బంగారు మరియు వెండి ఆభరణాలు, పువ్వులు మరియు ఇతర నైవేద్యాలతో సహా అందమైన అలంకరణలతో అలంకరించబడింది. యాత్రికులు దేవతకు ప్రార్థనలు మరియు నైవేద్యాలు సమర్పించి, ఆమె ఆశీర్వాదం కోసం అనుమతించబడతారు.

ఆలయంలో పెద్ద హాలు కూడా ఉంది, ఇక్కడ మతపరమైన వేడుకలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. హాలు అందమైన పెయింటింగ్స్ మరియు కుడ్యచిత్రాలతో అలంకరించబడింది, హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణిస్తుంది.

ఆలయ సమయం

వేసవిలో, లైవ్ ఆర్టి ఉదయం 06:20 నుండి 08:00 వరకు (ఉదయం) మరియు 07:20 నుండి 08:30 వరకు (సాయంత్రం) అందుబాటులో ఉంటుంది. శీతాకాలంలో, లైవ్ అట్కా ఆర్టి ఉదయం 06:20 నుండి 08:00 వరకు (ఉదయం) మరియు సాయంత్రం 06:20 నుండి 08:00 వరకు (సాయంత్రం) అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:Vaishno Devi Temple History in Telugu,vaishno devi temple jammu,vaishno devi temple timings,vaishno devi temple height,vaishno devi temple best time to visit,vaishno devi temple significance,vaishno devi temple accommodation,jammu&kashmir famous temples,bhakthimargam,bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu 

Comments