కాండ్రకోట శ్రీ నూకాలమ్మ అమ్మవారు దేవాలయం పెద్దాపురం | kandrakota Sri Nookalamma Ammavaru Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


శ్రీ
 నూకాలమ్మ అమ్మవారి దేవాలయం

నూకాలమ్మ అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం కాండ్రకోట గ్రామంలో దేవాలయం ఉంది.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారిని భక్తులు కొండంత అండగా భావిస్తారు.

ఆలయ చరిత్ర

కాండ్రకోటను పూర్వం కిమీరు అని పిలిచే వారు.కిమ్మీరాసురుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు. అందువల్ల ఈపేరు వచ్చింది తరువాతి కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల క్రాండ్రకోట అని పేరు వచ్చింది.కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడు.

అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారు.అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు.ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుఠిత దీక్షతో ప్రార్థించాడు.

ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది. ఆ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు.

ఆ ఆది పరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు - అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరనిది.

నూకాలమ్మను నమ్మిన వాళ్లు. మశూచిలాంటి అంటువ్యాధులు అమ్మ మాత్రమే అరికట్టగలదంటారు. పాడిపంటలు కళకళలాడాలంటే తల్లి దీవెన ఉంటే చాలని నమ్ముతారు.

స్థలపురాణం ప్రకారం

పూర్వకాలంలో క్రూరమృగాలతో నిండిన మహారణ్య ప్రాంతంలో ఏలా మహాముని శివుడ్ని ప్రార్థిస్తూ కఠోరమైన తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్ష్యమై వరం కోరుకోమన్నాడు. దానికాయన సముద్రంలో కలవని నదిని ప్రసాదించమనీ, ఆ నదిలో నీరంతా పాడిపంటలకూ, దాహార్తిని తీర్చేందుకే ఉపయోగపడాలని కోరాడు. దానికి శివాజ్ఞ లభించడంతో... ఆ ప్రాంతంలో ఏలా ముని పేరిట ఏలేరు అనే నది ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతం కిమ్మీరుడు అనే రాక్షసరాజు పరిపాలనలోకి వెళ్లింది. దాన్ని కిమ్మీరుసీమగా పిలిచేవారు.

ఈ రాజు తన రాజ్యంలోని ప్రజల్ని చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈ ప్రాంతానికి అతి సమీపంలో చంద్రవంశ రాజైన ధర్మకేతు మహారాజు రాజ్యం ఉండేది. కిమ్మీరుడి రాజ్యంలోని ప్రజలు తమని రక్షించాలని ధర్మకేతుడిని ఆశ్రయించారు. వాళ్ల అవస్థలు చూసి చలించిన ధర్మకేతుడు కిమ్మీరుడితో యుద్ధం చేశాడు. అయితే అతడు మహామాయావీ, అరివీర భయంకరుడే కాదు అఖండ సైన్య సంపత్తి కలిగిన వాడు అవడంతో ధర్మకేతుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు.

కిమ్మీరుడి ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతుండటంతో ఎలాగైనా ఆ రాజ్యపు ప్రజలకు విముక్తి కలిగించాలనే బలమైన కోరికతో ధర్మకేతుడు పరాశక్తిని పరమనిష్ఠతో ప్రార్థించాడు.
దానికి ప్రసన్నమైన అమ్మ తన అనేకానేక అంశల్లో ఒక అంశను ధర్మకేతుడికి తోడుగా పంపింది. ఆమె సాయంతో ధర్మకేతుడు కిమ్మీరుడిని ఓడించి, వధించి ఆ రాజ్య ప్రజలకు విముక్తిని కలిగించాడు. ధర్మకేతుడు పరిపాలించిన రాజ్యమే కాలక్రమంలో కాండ్రకోటగా మారిందట. ఆయనకు యుద్ధంలో సాయం చేసిన అమ్మే నూకాలమ్మ. 

తన జతనయానికి సాయం చేసిన కృతజ్ఞతతో అమ్మవారిని రాజ్యాధిదేవతగా కొలిచాడట ఆ రాజు. ఆ ఏలా నది ప్రవహించే ప్రాంతాన్ని ఏలేరుగా పిలుస్తారు. ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లా ఏలేరు ప్రాంతపు వూళ్ల ప్రజలంతా ఏ శుభకార్యమయినా అమ్మవారిని ముందుగా పూజిస్తారు.

41 రోజుల జాతర

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారి జాతరంటే చుట్టు పక్కల వూళ్లకే కాదు ఆ జిల్లాకే పెద్ద పండగ. ఈ జాతరను కనీసం 500 సంవత్సరాలకు పూర్వం నుంచీ నిర్వహిస్తున్నారు.

 1956లో ఆలయం దేవాదాయధర్మాదాయ శాఖ అధీనంలోకి వెళ్లాక ఆ శాఖ ఆధ్వర్యంలోనే జాతర నిర్వహిస్తున్నారు. మశూచీ, అమ్మవారులాంటి వ్యాధులు వూరిని చేరకుండా ఉండాలనీ, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని వేడుకోవడం జాతర ప్రధానోద్దేశం. ఫాల్గుణ మాసం బహుళ చతుర్దశి (ఈ ఏడు మార్చి 27న) రోజున రాత్రి జాగరణతో జాతర ప్రారంభమవుతుంది. జాతరకు 15 రోజుల ముందే గరగలతో వూరేగింపు జరుగుతుంది. జాతరనాటి రాత్రి బాణసంచా పోటీలు నిర్వహిస్తారు.

 పులి వేషాలూ, గరగల నృత్యాలూ, మేళతాళాలతో జరిగే అమ్మవారి ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు తరలివస్తారు. మొత్తం 41 రోజులు జరిగే ఈ జాతరకు ఏడు లక్షల మందిదాకా భక్తులు హాజరవుతారు. ఆది, మంగళ, గురువారాల్లో అధిక సంఖ్యలో జనం అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడి భక్తులు అమ్మవారికి అరిసెలు, పాయసం, బూరెలు, సున్నుండలతో పాటు, కోళ్లు, చీరలు, గాజులు సమర్పించుకుంటారు.

ఉత్సవాలు

పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు.

రవాణా

రాజమహేంద్రవరం నుంచి రాజానగరం వయా కాకినాడ బస్సు ద్వారా పెద్దాపురం దర్గా సెంటర్‌లో దిగాలి. అదే రైలులో అయితే సామర్లకోటలో దిగి పెద్దాపురం చేరొచ్చు. పాతపెద్దాపురం రోడ్డు గుండా ప్రయాణిస్తే కాండ్రకోటకు సుమారు 8 కి.మీ. దూరం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది.

Temple Timings

Morning : 5am To 12.30pm
Evening :4pm To 8pm

By Road :

peddapuram to kandrakota
18 min (9.1 km) via Peddapuram - Tamarada Rd

kakinada to kandrakota 
50 min (28.8 km) via Peddapuram - Tamarada Rd

samalkot to kandrakota 
25 min (13.9 km) via Peddapuram - Tamarada Rd

By Train :

samalkot to kandrakota 
25 min (13.9 km) via Peddapuram - Tamarada Rd

Related Postings:

Tags : sri nookalamma ammavaru temple peddapuram history in telugu, sri nookalamma ammmavaru kandrakota temple history in telugu, peddapuram famous temples, east godavari famous temples, andhra pradesh famous temples, india famous temples, world famous temples, sri nookalamma ammavari temple story in telugu, Kandrakota Nookalamma Talli Temple Information, Kandrakota Nookambika Temple  History, Timings, Accommodations , peddapuram temple, peddapuram history in telugu

Comments