అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయ చరిత్ర | కోనసీమ తిరుపతి | APPANAPALLI SRI BALA BALAJI TEMPLE HISTORY IN TELUGU | Bhakthi Margam | భక్తి మార్గం
పాంచరాత్ర ఆగమం
శ్రీ వెంకటేశ్వరుని బాల్య క్రీడలను శ్రీ వకుళామాత చూసి తరించిన స్థలమే " అప్పనపల్లి క్షేతము
శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అను ఇద్దరు భార్యలు కలరు. కద్రువ పిల్లలు నాగులు, వినత కుమారుడు వైనతేయుడు. కొన్ని కారణాల వలన వైనతేయుడు నాగులను రోజుకొకటి తినేవాడు.
శంఖచూడుడనే నాగును కాపాడుటకు జీమూతవాహనుడనే విద్యాదర చక్రవర్తి బలయ్యాడు.జీమూతవాహనునని దేహార్పణ ఫలించిన ప్రాంతము కనుక " ఆర్పణఫలి " అను పేరు వచ్చింది. అదే క్రమంగా అప్పనపల్లి అయినదని విజ్జుల అభిప్రాయం.
జీమూతవాహనుని కోరికతో కశ్యప ప్రజాపతి సలహాతో వైనతేయుడు చనిపోయిన సర్పములకు ఉత్తమ గతులు కల్పించడానికి వశిష్ట నుండి ఒక నదీపాయను 'ఆర్పణఫలి'(అప్పనపల్లి) మీదుగా ప్రవహింపజేశాడు. అదే వైనతేయ నది. ఇది ఉత్తర వాహిని ఆగుటచే అప్పనపల్లి సహజమైన పుణ్య క్షేతము.
శ్రీ వేంకటేశ్వరస్వామి బాల్యరూపాన్ని, బాల్య క్రీడలను చూసి తరించాలని వకుళామాత వరం కోరినది. వైనతేయ నదిని పవిత్రం చేయమని గరుత్మంతుడు కోరాడు. వారిద్ధరికీ ఆయా వరాలిచ్చి స్వామి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో శ్రీ వెంకటటేశ్వర స్వామి సంకల్పబలంతో అప్పనపల్లిలో మొల్లేటి మునియ్య, మంగమ్మల పుత్రుడై శ్రీ రామస్వామి గారు జన్మించారు.
చిన్నతనం నుండి నిరంతర భక్తి తత్పరుడైన రామస్వామి కొబ్బరికాయల వ్యాపారంలో వచ్చిన లాభంతో కొంత వాటాను శ్రీ వేంకటేశ్వర స్వామికి తిరుపతి తీసుకొని వెళ్ళి ఏటా సమర్పించేవారు. ఒకసారి స్వామి పాదాల వద్ద ఆ ధనం పెడతానంటే అర్చకులు అంగీకరించలేదు. వాదించి వాదించి అలసి నిద్రించిన రామస్వామి కలలో బాలుడి రూపంతో శ్రీనివాసుడు కనిపించి తానే అప్పనపల్లి వస్తానన్నాడు.
అ ముద్దుల బాలునిచూచి మైమరచిన రామస్వామి బాల బాలాజీగా నామకరణం చేసి అప్పనపల్లిలో తన కొబ్బరి కొట్లో ప్రతిష్టింపచేసి నిత్య పూజలు చేస్తున్నాడు. అశేష భక్తవాహిని శ్రీ బాల బాలాజీ స్వామి వారిని సేవించి అనేక ఉత్కృష్ఠ ఫలితాలను పొందు చున్నరు.
ఆలయ చరిత్ర
శ్రీ మొల్లేటి మునెయ్య మరియు మంగమ్మ దంపతులకు శ్రీ రామస్వామి జన్మించాడు మరియు ఇతను సాధారణ కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు, శ్రీ మొల్లేటి రామస్వామి వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప భక్తుడు.
ప్రతి సంవత్సరం అతను తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, స్వామి వారికి తన సంపాదనలో కొంత భాగాన్ని సమర్పించేవాడు. ఒకసారి శ్రీ మొల్లేటి రామస్వామి తన కానుకను ఆలయంలో స్వామి వారి పాదాల వద్ద ఉంచమని పూజారులను అర్దించగా పూజారులు రామస్వామి యొక్క అభ్యర్థనను తిరస్కరించారు, దీనితో అతను చాలా నిరాశ చెందాడు.
అదేరోజు రాత్రి శ్రీ రామస్వామి యొక్క కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనిపించి రామస్వామిని ఓదార్చి, "బాల బాలాజీ (శిశు దేవుడు)గా అప్పనపల్లికి వస్తానని చెప్పను". పైన పేర్కొన్న మూడు బాధ్యతలు నెరవేర్చడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ బాల బాలాజీ స్వామిగా అవతరించారు. 1966 శ్రీ రామస్వామి తన దుకాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అతని భార్య పద్మావతి అమ్మవారి ఫోటోలను పెట్టి పూజించసాగెను.
అది తెలిసి యాత్రికులు వేలాదిగా సందర్శించడం ప్రారంభించారు మరియు దీనివలన అప్పనపల్లి రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల పటంలో ప్రాముఖ్యతను పొందింది. శ్రీ రామ స్వామి అక్కడకి వచ్చిన భక్తులకు ఉచిత భోజనం, వైద్య సహాయంతో పాటు శిశువులకు పాలు అందిచడం ఎలా సాధ్యమౌతుంది అనేది ఎవరికైనా వివరించడానికి ఆశ్చర్యం మరియు ఊహకు అందనిది.
శ్రీ రామస్వామి తరచుగా భక్తులకు ఇలా చెప్పేవారు "ఇది స్వామివారి సంకల్పం, నేను ఎవరిని ఈ భాగ్యం పొందుటకు".

Comments
Post a Comment